తిరుమలగిరి లో కొనసాగుతున్న బంద్.. పోలీసుల భారీ బందోబస్తు

తిరుమలగిరి లో కొనసాగుతున్న బంద్.. పోలీసుల భారీ బందోబస్తు

ముద్ర.తిరుమలగిరి: దళిత బందులో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు గత మూడు రోజుల క్రితం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన అఖిలపక్ష నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ  అఖిలపక్షకమిటీ ఆధ్వర్యంలో శుక్ర వారం నిర్వహిస్తున్న తిరుమలగిరి బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది  బంధు సందర్భంగా ఉదయం 8 గంటల నుండి అఖిలపక్ష పార్టీలకు చెందిన కాంగ్రెస్ బిజెపి ఎమ్మార్పీఎస్ వైఎస్ఆర్ టి పి  బహుజన సమాజ్ పార్టీ సిపియుఎస్ఐ తదితర కార్యకర్తలు పట్టణ బంధు నిర్వహించాలని స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుమలగిరి పట్టణ బందుకు ఇద్దరు సిఐలు పదిమంది ఎస్సైలు 50 మంది కానిస్టేబుల్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు.