యువత 2కె రన్ లో పాల్గొనాలి

యువత 2కె రన్ లో పాల్గొనాలి

మఠంపల్లి ,ముద్ర: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా  ఈనెల 12 హుజుర్ నగర్ లో జరిగే 2కె రన్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని మఠంపల్లి యస్ ఐ బాలకృష్ణ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 6.30 నిమిషాలకు హుజుర్ నగర్ టౌన్ లో 2కె రన్ ఉంటుందని కావున మండలంలోని యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.