శ్రమదానంతో రోడ్లపై గుంతలను పొడిచిన ఎన్ ఎస్ యు ఐ యువకులు

శ్రమదానంతో రోడ్లపై గుంతలను పొడిచిన ఎన్ ఎస్ యు ఐ యువకులు
  • రావులపల్లి నుండి రావులపల్లి తండా వరకు గుంతల మయంగా మారిన రోడ్డు

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామం నుండి రావులపల్లి తండాకు వెళ్లే రోడ్డు మొత్తం గుంతల మయంగా మారడంతో ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు శ్రమదానంతో గుంతలను మట్టితో పూడ్చివేశారు .ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ అధ్యక్షుడు కొండగడుపుల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నుండి రావులపల్లి ఎక్స్ రోడ్డు వరకు, అలాగే రావులపల్లి నుండి రావులపల్లి తండా వరకు రోడ్లు గుంతల మయంగా మారాయని అధికారులు తక్షణమే గుంతల మయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు .

రోడ్లపై గుంతలతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు .తాము శ్రమదానంతో రావులపల్లి నుండి రావులపల్లి తండా వరకు పెద్దగా ఉన్న గుంతలను మట్టితో పూడ్చామని ఇకనైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతుకు సిద్ధం కావాలని కోరారు .శ్రమదాన కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జ్ చింతకుంట్ల హరీష్ ,చిన్ని కృష్ణ యాదవ్, రావులపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నన్నే బోయిన శేఖర్ , జోగులూరి మహేష్ ,కుమ్మరి లింగన్న ,మరికంటి వినోద్ ,సింగం రామ్మూర్తి లతోపాటు పలువురు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.