పార్టీ ని వీడేదిలేదు.. మల్లయ్యకు మద్దతిచ్చేది లేదు - ఎర్నేని బాబు

పార్టీ ని వీడేదిలేదు.. మల్లయ్యకు మద్దతిచ్చేది లేదు - ఎర్నేని బాబు

నాపై కావాలనే అసత్యప్రచారాలు - శశిధర్ రెడ్డి

ముద్ర , కోదాడ: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు నివాసంలో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు కావాలనే శశిధర్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళుతున్నారని వస్తున్న వార్తలను ఖండించారు . కేవలం అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు . బిఆర్ఎస్ పార్టీలోనే ఉండి మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారుడు శశిధర్ రెడ్డి కి వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని  అందరం కలసికట్టుగా పని చేసి విజయం అందిస్తామని హితవు పలికారు . ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే పనిచేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు . ఈ సందర్భంగా బిఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తానూ ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ ను వీడనని , మొదటి నుండి పార్టీ కోసం పని చేసి పార్టీ కి పనిచేసిన తనకే ఈ సారి టికెట్ వస్తుందని , తన విజయానికి అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నానన్నారు . తానే నియోజకవర్గంలో మొదటి నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనను ఈ సారి కచ్చితంగా కేసీఆర్ , కేటీఆర్ గుర్తిస్తారని తనకు తగిన గుర్తింపు ఈ సారి పార్టీ కలిపిస్తుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు . ఇట్టి కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు బొలిశెట్టి. నాగేంద్రబాబు , గుండపునేని. నాగేశ్వర రావు, తిపిరిశెట్టి.రాజు , రాయపూడి. వెంకటనారాయణ , సుంకరి.నాగయ్య , హసన్ , అలీ , రామాచారి తదితరులు పాల్గొన్నారు .