ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీఎస్పీ నాగభూషణం

ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీఎస్పీ నాగభూషణం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 27వ వార్డు తాళ్లగడ్డలో శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారి బోనాలు మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈమేరకు డిఎస్పి పరికే నాగభూషణం ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా గౌడ పెద్దలు డిఎస్పిని శాలువాలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేక బోనాలు అని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.