చెత్తను కాలువల్లో వేసి ఇబ్బందులు సృష్టించుకోవద్దు

చెత్తను కాలువల్లో వేసి ఇబ్బందులు సృష్టించుకోవద్దు
  •  మిగిలిన ఆహారాన్ని తడి చెత్తగా మున్సిపల్ ట్రాక్టర్కు అందించాలి
  •  పొడి చెత్తను దాచి ఆర్ఆర్అర్ కేంద్రాల్లో కిలో రూ 5కు విక్రయించాలి
  •  ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
  • ముద్ర ప్రతినిధి, సూర్యాపేట

ప్రజలు తమ ఇండ్లల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మురికి కాలువల్లో వేసి నీళ్లు ఆగేలా చేసుకుని ఇబ్బందులు పడొద్దని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో పట్టణంలోని 29వ వార్డులో ఏర్పాటుచేసిన ప్రత్యేక పారిశుద్య కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలు కాలువల్లో చెత్తను వేయడంతో కాలువల్లో మురుగునీరు నిలిచిపోయి అందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. తమ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను ఇంటి ముందుకు వచ్చే మున్సిపల్ ట్రాక్టర్కు అందించాలన్నారు. ఇండ్లలో మిగిలిన ఆహారాన్ని తడి చెత్తగా మున్సిపల్ ట్రాక్టర్ కు అందించాలన్నారు.

పొడి చెత్తను దాచి వార్డులో ఏర్పాటు చేసే ఆర్ ఆర్ ఆర్ కేంద్రాల్లో కిలో రు 5కు విక్రయించాలన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి అనుగుణంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణ ప్రజలంతా పొడి చెత్తను రోడ్ల వెంట వేయకుండా దాచిపెట్టుకుని విక్రయించి ఆదాయం పొందాలని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్విని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం వార్డులో రోడ్లను శుభ్రం చేసి కాలువల్లో కూడికతీత పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రామానుజుల రెడ్డి, 29వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి, ఈఈ జికెడి ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, వార్డు అధ్యక్షుడు అనంతుల నాగరాజు, మెప్మా సిబ్బంది నళిని, గోపగాని సందీప్,  గోపగాని నాగరాజు, జవాన్ వేణు తదితరులు పాల్గొన్నారు.