ఎట్టకేలకు అవిశ్వాసానికి తెర
![ఎట్టకేలకు అవిశ్వాసానికి తెర](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6477651fc43e0.jpg)
- పంతం నెగ్గించుకున్న వార్డు మెంబర్లు.
- పోలీసుల పహారా మధ్య సమావేశం
- ప్రశాంతంగా ముగిసిన సమావేశం ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
కోదాడ, ముద్ర: మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో ఉప సర్పంచ్ పై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానం బుధవారం పోలీస్ పహారా నడుమ అధికారులు నిర్వహించారు. గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో మొత్తం వార్డ్ నెబర్లు 8 మంది కాగా ఐదుగురు వార్డు మెంబర్లు హాజరయ్యారు అవిశ్వాస తీర్మానం చేతులు ఎత్తి ఎన్నిక నిర్వహించారు. దీంతో ఐదుగురు కూడా చేతులు ఎత్తి ఓటు వేశారు అని ఆర్డిఓ కిషోర్ కుమార్ తెలిపారు. దీంతో వార్డు మెంబర్లు కొంతమంది వాళ్లు అనుకున్న పంతం నెగ్గించుకున్నారు. మొదటిసారి వాయిదా పడిన అవిశ్వాస తీర్మానం రెండోసారి ఎట్టకేలకి తెరపడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.కోదాడ ఎంపీడీవో విజయశ్రీ,, చిలుకూరు ఎంపీడీవో ఈదయ్య,డిప్యూటీ తహసిల్దార్ అనిల్ బాబు, ఎంపీఓ తుమ్మల నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు