అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం - కమిషనర్ వెంకటేశ్వర్లు

అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం - కమిషనర్ వెంకటేశ్వర్లు

హుజూర్నగర్,ముద్ర: అభివృద్ధిలో ప్రజలు భాగస్వామి కావాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,4వ వార్డ్ కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు కోరారు. బుధవారం పట్టణంలోని నాలుగో వార్డ్ లో రెడ్యూస్, రీ యూస్, రీసైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ప్రజల ఇల్ల లో నిరుపయోగంగా ఉన్న దుస్తులు ప్లాస్టిక్ వస్తువులు ఆట బొమ్మలు అందించాలన్నారు. కార్యక్రమంలో అశోక్ ,పద్మ రాజశేఖర్ గౌడ్, వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, రాములు ,పద్మ పాల్గొన్నారు.