విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

మఠంపల్లి, ముద్ర: మండలంలోని పాతదోనబండ తండాలోని శ్రీ సీతారామ,అభయాంజనేయ ,ముత్యాలమ్మ తల్లి,బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాలలో హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి సోమవారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బడులు, గుడులతో కళ కళ లాడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఏజెండగా పనిచేస్తున్నదని అన్నారు. తెలంగాణా లో ఒకేఒక్క ట్రైబల్ వెల్ఫైర్ గురుకుల పాఠశాలను హుజుర్ నగర్ లో స్థాపించుకోవడం జరిగిందని అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి గిరిజన భవనాన్ని కూడా నిర్మించినట్లు ఆయన చెప్పారు.

ముఖ్యంగా గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి తండాలను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనం ఋణపడి ఉన్నామన్నారు. బొడ్రాయిలను,నూతన దేవాలయాలను నిర్మించుకొని ప్రజలు ఆధ్యాత్మికంగా సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి ఎం పి పి మూడవత్ పార్వతి కొండా నాయక్,జడ్పిటిసి బానోతు జగన్ నాయక్,మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ యస్ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య,అల్లిపురం యం పి టి సి లక్ష్మీ భరత్ నాయక్,మాజీ వైఎస్ యం పి పి సల్వాది సీతారామయ్య,మాజీ యం పి టి సి లు నాగు నాయక్ ,వీణా నాయక్ ,రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.