నాణ్యమైన వైద్య సేవలు అందించాలి -మంత్రి జగదీష్ రెడ్డి

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి -మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి : నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన  గ్లోబల్ కంటి హాస్పిటల్ ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మెడికల్ హబ్ గా మారిందన్నారు. లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్,డాక్టర్ హర్షవర్ధన్, బొలగాని భిక్షపతి, వెంకట రెడ్డి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.