తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం ఖాయం
![తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడం ఖాయం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645f8d9f40a5b.jpg)
- హుజూర్నగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు
- సంబరాల్లో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు నలమాధ పద్మావతి రెడ్డి
హుజూర్ నగర్, ముద్ర: తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమని టిపిసిసి ఉపాధ్యక్షురాలు నలమాల పద్మావతి రెడ్డి అన్నారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం నమోదు చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణ మెజారిటీ సందర్భంగా శనివారం హుజుర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా సెంటర్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచుకుని భారీ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కోదాడ మాజీ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలు వలే తెలంగాణలో రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని మరియు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గలలో కాంగ్రెస్ పార్టీ 50 వేల పై చిలుకు మెజార్టీతో గెలుస్తుంది , ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కర్ణాటక లో కాంగ్రెస్ సాధించిన విజయ స్ఫూర్తితో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని తెలియ జేసినారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాముల శివారెడ్డి, గల్లా వెంకటేశ్వర్లు, బాచి మంచి గిరిబాబు, షేక్ సైదా, ఇట్టి మల్ల బెంజిమెన్, ఎరగని నాగన్న గౌడ్, కుకడపు మహేష్, రామ్మూర్తి, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్నారు.