రెజ్లర్ల పై లైంగిక వేధింపులు పాల్పడ్డ బిజెపి ఎంపీని అరెస్ట్ చేయాలి

రెజ్లర్ల పై లైంగిక వేధింపులు పాల్పడ్డ బిజెపి ఎంపీని అరెస్ట్ చేయాలి

 తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు కంబాల శ్రీనివాసు
హుజూర్ నగర్, ముద్ర:   భారత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిజెపి ఎంపీ ని అరెస్టు చేయాలనీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాసు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పోజు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ భృజ భూషణ్ శరన్ సింగ్  ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి మహిళ లను కాపాడాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవినీతి అక్రమార్కులను పెంచి పోషిస్తుందని ఆరోపించారు. దేశానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మహిళలపై లైంగిక వేధింపులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు.  మోడీ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జక్కుల రమేష్, పొనుగుపాటి వాసుదేవరావు, కృష్ణ, స్టాలిన్, శ్రీనివాసు, రమణ పాల్గొన్నారు.