పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి

పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి

 హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్నగర్ ,ముద్ర: పురాతన దేవాలయాలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. శనివారం హుజూర్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోపాలపురం ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసి పూలమాలలు , శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనేక దేవాలయాలకు పాలక మండల్లు ఏర్పాటు చేసి దేవాలయం అభివృద్ధి చేస్తామన్నారు .భక్తులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు .హనుమాన్ జయంతిని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి, సాతులూరి వెంకటేశ్వర్లు, చలపతి ,అలహరి, నరసింహాచార్యులు ,ఎంపిటిసి చీకురు రాజారావు తదితరులు పాల్గొన్నారు.