బిజెపికి పతనం ప్రారంభం

బిజెపికి పతనం ప్రారంభం

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపుతో బిజెపి పతనం ప్రారంభమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బిజెపి గద్దెనెక్కిందని ఆరోపించారు. ప్రధాని హోదాలో మోడీ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మత విద్వేషాలను రెచ్చగొట్టారని తెలిపారు. విజ్ఞులైన కర్ణాటక ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తూ కాంగ్రెస్ కు అండగా నిలిచారన్నారు. ఇక తెలంగాణలో ఏర్పడబోయే ప్రభుత్వం కాంగ్రెస్ దే అన్నారు.
 ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కి నిటి లభ్యత కొసమే వార్థా ప్రాజెక్టు కడుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ భగీరథ నిటిని తాగుతున్న దాఖలాలు లేవన్నారు. దేశంలో రుణమాపి వాగ్దానం చేసి అమలు చెయ్యాని ఎకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పారు.
తెలంగాణ బిజెపి గెలుపు ఆశలపై కర్ణాటక ఎన్నికల ఫలితాలు నీళ్ళు చల్లినట్లు అయిందని వ్యాఖ్యానించారు. ఆయన వెంట చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కమిటీ రెడ్డి నరేందర్ రెడ్డి తో పాటు పలువు పాల్గొన్నారు.