మెదక్ లో యువజన కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన ర్యాలీ
![మెదక్ లో యువజన కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన ర్యాలీ](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_642455c088d1e.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీకి మద్దతుగా కాగడాల ప్రదర్శన ర్యాలీ బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ కుటుంబంపై వేధింపుల్లో భాగంగానే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడం జరిగిందన్నారు.
రాహుల్ గాంధీని చూస్తే మోడీ ప్రభుత్వం బయపడుతుందని అన్నారు. ఆధాని చేసిన అవినీతి పై రాహుల్ గాంధీ గారు లోక్ సభలో మాట్లాడటన్ని బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా వెనకడుగు వేయరన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు రమేష్ గౌడ్, ప్రేమ్ కుమార్, భారత్ గౌడ్, దయాసాగర్, ఉదయ్ కుమార్, మహేష్, అదిల్, మధు, భాను, వినోద్, సతీష్, సల్మాన్, దయాసాగర్, శ్రీమాన్,పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.