దసరా షాపింగ్ చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్ -దంపతుల మృతి

దసరా షాపింగ్ చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్ -దంపతుల మృతి
  • నలుగురికి గాయాలు

పెద్దశంకరంపేట, ముద్ర:మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామ శివారులో బుదవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దసరా పండుగ షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడడంతో భార్యభర్తలు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోలక్ పల్లికి చెందిన నారాయణ (60), దేవమణి (57) దంపతులు దనరా షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగిబోధన్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు బుధవారం తెల్లవారు జామున అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నారాయణ, దేవమణి చనిపోగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను సంగారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్లదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.