బిజెపి కౌన్సిలర్  బిఆర్ఎస్ లో చేరిక

బిజెపి కౌన్సిలర్  బిఆర్ఎస్ లో చేరిక
  • కండువా కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డికి  మద్దతు తెలుపుతు మెదక్ మున్సిపల్ 21వ వార్డు కౌన్సిలర్ బెండల నిర్మల నాగభూషణం  ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో సోమవారం చేరారు. ఆమెతో పాటు 60 మంది బిజెపి నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే  శశిధర్ రెడ్డి, మెదక్ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,  మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే బిఆర్ఎస్ కార్యాలయం వద్ద హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని ఫరీద్ పూర్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు 80 మంది  బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హవేలి ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సౌందర్య వినోద్, ఉప సర్పంచ్ వెంకటి ఎంపీటీసీ సభ్యులు రాజయ్య, పాక్స్ చైర్మన్ బ్రహ్మం, నాయకులు సిద్దు, బాబు, బ్రహ్మం,బాలయ్య,కృష్ణయ్య,శ్రను తదితరులు పాల్గొన్నారు.