కష్టపడ్డ వారికే టికెట్ సర్వేలన్నీ మనకే అనుకూలం

కష్టపడ్డ వారికే టికెట్ సర్వేలన్నీ మనకే అనుకూలం
  • డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి వెల్లడి 

ముద్ర ప్రతినిధి, మెదక్:కష్టపడిన వారికే టికెట్ వస్తుందని, సర్వేలన్ని మనకే అనుకూలంగా ఉన్నాయని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ...  కార్యకర్తలెవరు అధైర్యపడకండి, 9 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి యెనలేని కృషి చేశాం, రాష్ట్రంలో   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మీరు కోరుకుంటున్న నాయకుడికే టికెట్ వస్తుంది, ఎవరు కూడా అభద్రత భావానికి గురికకండి,అపోహలను నమ్మకండన్నారు. మీకు నేను అండగా ఉంటానన్నారు. బిఆర్ఎస్ పాలనలో విసిగిపోయామని సోనియా గాంధీ విజయభేరి సభతో గ్రామాలలో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. రైతులకు ఒరిగిందేమీ లేదని, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులకు, న్యాయం జరగలేదన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడి పోయామని అందుకే కాంగ్రెస్ పార్టీలో  చేరుతున్నారని తెలిపారు.

హవేలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి, గాజిరెడ్డిపల్లికి చెందిన సుమారు 100 మంది బిఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు మమిల్ల ఆంజనేయులు, పల్లె రాంచందర్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు  ప్రభాకర రెడ్డి, మండలాల అధ్యక్షులు, శంకర్, శ్రీనివాస్, ఆంజనేయులు, గోవింద్ నాయక్, శంరెడ్డి, శంసుంధర్, శ్రీమాన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అవారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.చేరినవారిలో తలారి యాదగిరి, తులసీరామ్, యాదగిరి, అబ్రబోయిన రాములు, చాకలి మైసయ్య, ఇండ్ల రాజు, విజయ్, పూల్ సింగ్, నర్సింలు, రాజు, ప్రభాకర్ తదితరులున్నారు.