యువకుడు, వివాహిత యువతి అదృశ్యం | Mudra News

యువకుడు, వివాహిత యువతి అదృశ్యం | Mudra News

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఒక యువకుడు, వివాహిత యువతి అదృశ్యమైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మండల కేంద్రానికి చెందిన ఇటీవలే వివాహమైన ఓ యువతి సోమవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లింది  గ్రామంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా బస్సులో వెళ్ళినట్టుగా గుర్తించారు. రామాయంపేటలో మరో యువకుడితో బైక్ పై వెళ్లిన దృశ్యాలు గమనించారు. నార్సింగి చెరువు వద్ద ఇరువురి చెప్పులు, బైక్ లభించడంతో చెరువులో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు అన్నికొణాల్లో దర్యాప్తు చేస్తున్నారు