కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ | Mudra News

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ | Mudra News

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ప్రమాదవశాత్తు చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబానికి భారాస పార్టీ 2లక్షలు బీమా చెక్కులను అందజేసిన   ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,
ఈరోజు గద్వాల టౌన్ లోని సుంకులమ్మ మెట్టు  చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ద్యాగ మాసమ్మ  రోడ్డు ప్రమాదంలో మరణించారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం లో భాగంగా ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 2 లక్షల ప్రమాద బీమా కింద  2.00.000 లక్షల రూపాయల చెక్కును  వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేతుల మీదుగా  అయిన భర్త  ద్యాగా శీను  కు  రెండు లక్షలు రూపాయలు చెక్కును అందజేయడం జరిగినది. .

ఎమ్మెల్యే. మాట్లాడుతూ 
బిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షుడు కెసిఆర్, పేద ప్రజలకు అండగా నిలిచారు  గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  అధికారంలోకి వచ్చినా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి  రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పింఛన్, మిషన్ భగీరథ, అలాగే బిఆర్ఎస్ పార్టీ  కార్యకర్తలకు  కూడా బిఆర్ఎస్ పార్టీ  సభ్యత్వం పొందిన వారికి  ప్రమాదవశాత్తు మరణించిన వారి  కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు. 
సీఎం కేసీఆర్ కి గద్వాల్ ఎమ్మెల్యే కి బిఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వైస్ చైర్మన్ బాబర్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు,  కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, కృష్ణ దౌలు, మహేష్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నర్సింహులు, గద్వాల టౌన్ పార్టీ ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్, నాగులు యాదవ్, రామకృష్ణ శెట్టి, షుకుర్,  కురుమన్న     సీతారాములు, శివశంకర్, శ్రీను, నవీన్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు