అప్పుల కుప్పగా బంగారు తెలంగాణ.. ప్రజాగోస బిజెపి భరోసాలో ఏపీ మిథున్ రెడ్డి | Mudra News

అప్పుల కుప్పగా బంగారు తెలంగాణ.. ప్రజాగోస బిజెపి భరోసాలో ఏపీ మిథున్ రెడ్డి | Mudra News

షాద్ నగర్, ముద్ర: కెసిఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని బిజెపి నాయకులు ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు దొడల వెంకటేష్, గ్రామ శక్తి కేంద్ర ఇంఛార్జి నరసింహ ఆధ్వర్యంలో దూసకల్ గ్రామంలో ప్రజాగోస - బిజెపి భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసేందుకే బిజెపి ఆధ్వర్యంలో ప్రజాగోస - బీజేపీ భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజా సంక్షేమ విషయంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో సాగుతున్ననియంత పాలన అంతమొందించడానికి కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో  విఫలమయ్యారు. నిరుద్యోగ భృతి హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.