మెదక్ లో జెండా ఆవిష్కరించిన మంత్రి తలసాని

మెదక్ లో జెండా ఆవిష్కరించిన మంత్రి తలసాని

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కలెక్టరేట్ లో 77వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ హేమలత, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, అడిషనల్ కలెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, డిఆర్ఓ పద్మశ్రీ, ఆత్మ చైర్మన్ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.