శాసనసభలో బంగారు బోనం ఎత్తిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
![శాసనసభలో బంగారు బోనం ఎత్తిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64ad08079e67c.jpg)
ప్రతీ సంవత్సరo మాదిరిగా ఆషాడ బోనాల సందర్భంగా తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన బోనాల ఉత్సవంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బంగారు బోనం సమర్పించారు.
బోనాల ఉత్సవంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖీందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, మంత్రి జగదీష్ రెడ్డి, శాసనసభ్యులు, శాసనసభ్యులు మండలి సభ్యులు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి, అధికారులు పాల్గొన్నారు.