కేసీఆర్ సారు.. అందిరికీ పింఛనిత్తుoడు...

కేసీఆర్ సారు.. అందిరికీ పింఛనిత్తుoడు...

ఎమ్మెల్సీ కవిత తో కంకులమ్మే నర్సమ్మ
ముద్ర, మల్యాల: జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ శ్రీమతి కవిత తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాస్త సేదతీరారు. ప్రధాన రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఆమె వివరాలు సేకరించారు. తన పేరు నర్సమ్మ అని పేర్కొంటూ... కేసీఆర్ తనకే కాదు ఇంటింటికి పించన్ ఇస్తుండని పేర్కొంది.

స్వయంగా కేసీఆర్ కూతురే తన వద్ద మొక్కజొన్న తింటూ మాట్లాడటంపై కొమురమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక ఎమ్మెల్సీ శ్రీమతి కవితను చూసిన స్దానిక వాహనదారులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ అభిమానాన్ని చాటుకోగా, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు ఎమ్మెల్సీ కవిత. ముఖ్యమంత్రి కూతురిగా ఉన్నా సాదాసీదాగా వ్యవహరించిందని ఈ సందర్బంగా పలువురు చర్చించుకుకోవటం విశేషం.