ఎమ్మెల్యే రాసిచ్చిన బాడ్ పేపర్ కు నాలుగో వర్ధంతి వేడుక

ఎమ్మెల్యే రాసిచ్చిన బాడ్ పేపర్ కు నాలుగో వర్ధంతి వేడుక

పిండ ప్రదానం చేసి వినూత్న రీతిలో గ్రామస్తుల నిరసన

మెట్‌పల్లి ముద్ర:- తమ ఊరి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని. ఎమ్మెల్యే హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తుందని అయిన ఇప్పటికీ బ్రిడ్జి రాలేదని. ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రధానం చేసి వినూత్న రీతిలో నాల్గవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఓ గ్రామస్తులు. వివరాల్లోకి వెళితే మండలంలోని కొండ్రికర్ల గ్రామస్తులకు గత ఎంపీటీసీ ఎన్నికల్లో మరో గ్రామస్తుడు ఎమ్మెల్యే అనుచరుడైన మారు సాయి రెడ్డిని ఎంపీటీసీ గా గెలిపిస్తే తమ ఊరు వాగు మీద రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం చేపడతానని హామీ బాండ్ పేపర్ రాసి ఇవ్వడంతో గ్రామస్తులు అందరూ కలసి మారు సాయి రెడ్డిని ఎంపీటీసీ గా గెలిపించారు.

ఎమ్మెల్యే బాండ్ పేపర్ రాసిచ్చి నాలుగేళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణం జరగలేదు దీంతో గ్రామస్తులు సోమవారం వాగు వద్ద బాండ్ పేపర్ కు పిండ ప్రధానం చేసి నాలుగవ వర్ధంతి వేడుకలు నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ ఊరికి ఇచ్చిన హామీ ప్రకారం వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని లేనిపక్షంలో ఉద్యమ కార్యచరణ రూపొందించి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.సర్పంచ్ ఆకుల రాజగంగు, ఉప సర్పంచ్ గంట రాజేశ్వర్, మారు జనార్దన్ రెడ్డి, అనిరెడ్డి ఆనంద్ బద్దం రమేష్, సంకు రాకేష్, సబ్బని అశోక్, మెండే జలంధర్ గ్రామస్తులు ఉన్నారు.