తెలంగాణ కోసం వేలాదిమంది త్యాగం చేశారు: ప్రియాంక 

తెలంగాణ కోసం వేలాదిమంది త్యాగం చేశారు: ప్రియాంక 

తెలంగాణ కోసం వేలాదిమంది త్యాగం చేశారని ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్​నగర్​ సభలో మాట్లాడుతూ తెలంగాణ స్వాప్నికుల్లో శ్రీకాంతాచాని ఒకరని అన్నారు. యువత భవిష్యత్తు కోసం తెలంగాణ వచ్చింది. నా కుటుంబం కూడా ప్రాణ త్యాగాలు చేసింది. దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణ త్యాగం చేశారు. బలిదానాలు వృథా కాకూదడని ప్రతి  ఒక్కరూ గుర్తించాలి. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్​ ఇంకా నెరవేరలేదు. తెలంగాణ బీఆర్​ఎస్​ జాగీరు కాదు. బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టడానికి మీరు పోరాడలేదు. 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్​ చెప్పిన ఇంటికో ఉద్యోగం నెరవేరలేదు. మీరు ఇందిరమ్మ  అంటే నా బాధ్యత గుర్తుకు వస్తుంది. నిజాయితీగా నిజం చెప్పాలన్నదే నా కోరిక. బైబై మోదీ, బైబై కేసీఆర్​సాకారం కావాలంటే కార్యకర్తలు బాద్యతను గుర్తించాలని ప్రియాంక గాంధీ అన్నారు.