ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబుకు రూ.30,500  ఆర్థిక సహాయం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబుకు రూ.30,500  ఆర్థిక సహాయం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  క్యాన్సర్ తో బాధపడుతు కరీంనగర్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రిత్విక్ అనే బాబుకు జగిత్యాల ఎస్ కే ఎన్ ఆర్ బికాం 1994-97 బ్యాచ్ మిత్ర బృందం రూ. రూ.30,500  ఆర్థిక సహాయం అందిచారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి గ్రామానికి చెందిన రాగళ్ల తిరుపతి రవళి దంపతులు పెద్దబ్బాయి రిత్విక్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా ట్రీట్మెంట్ కోసం కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు.

పిల్లవాని వైద్యానికి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ఆవేదనతో తన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఆపన్న హస్తం కోసం దాతల నుంచి సహాయం కొరకు ఎదురుచూస్తున్నారు. ఇందులో బాగంగా జగిత్యాల ఎస్ కే ఎన్ ఆర్ బికాం 1994-97 బ్యాచ్ మిత్ర బృందం రూ. రూ.30,500  ఆర్థిక సహాయం అందిచారు. ఇంక దాతలు ముందుకు వచ్చి బాబును ఆదుకోవాలని వారు కోరుతున్నారు . దాతలు ఎవరైనా 9121394906 ఫోన్ నెంబర్ ను సంప్రదించి రిత్విక్ కు కొత్త జీవితం ప్రసాదించాలని తల్లిదండ్రులతో పాటు వారు అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తపాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, వూటూరి రమేష్, చిట్టి మల్ల రఘు, లింగమూర్తి, పైన్ల రాజేశం, దుమాల శివ, ఎదులపురం లక్ష్మన్, నిర్మల, హరిప్రియ, శివరామకృష్ణ, సునీత, రాగి లక్ష్మినారాయణలు పాల్గొన్నారు.