కొండగట్టులో పోటెత్తిన భక్తజనం

కొండగట్టులో పోటెత్తిన భక్తజనం

 ఒకే కౌంటర్ తో టికెట్ల కోసం భక్తుల ఇక్కట్లు...
----------------------------------------
ముద్ర, మల్యాల: ప్రసిద్ధి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం మంగళవారం భక్తజనంతో పోటెత్తింది. జయంతి ఉత్సవాలు ముగిసినప్పటికీ అంజనాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మంది భక్తులు తరలివచ్చి అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు ముగియడంతో అధికారులు స్వామివారి అర్జీత సేవలు పునరుద్దించారు. కాగా, వివిధ టికెట్ల కోసం కౌంటర్ ఒకటే ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం కౌంటర్ వద్ద ఒకరినొకరు తోసుకునే పరిస్థితి తలేత్తిoది.