మల్యాలలో డెంగ్యూ దినోత్సవం

మల్యాలలో డెంగ్యూ దినోత్సవం

ముద్ర, మల్యాల:జాతీయ డెంగ్యూ దినోత్సవo పురస్కరించుకొని మల్యాల మండల కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్స్ బ్లాక్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, డెంగ్యూ వ్యాధి నిర్మూలనకై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యాధికారి మౌనిక, తదితరులు పాల్గొన్నారు.