జగదేవ్ పేటలో 20 మంది విద్యార్థులకు ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ద్వార  సైకిల్ల పంపిణీ..

జగదేవ్ పేటలో 20 మంది విద్యార్థులకు ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ ద్వార  సైకిల్ల పంపిణీ..

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలం లోని జగదేవ్ పేట గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన 20 మంది విద్యార్థులకు ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత  సైకిళ్లను పంపిణీ చేశారు. కాగా  వీరందరు వెల్గటూర్ మండలంలోని కుమ్మరి పల్లి లో గల  ఆదర్శ పాఠశాల, ఎండపల్లి  మండలం లోని కొండాపూర్ గ్రామం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో చదువుతున్నారు. వీరికి సైకిల్ లను అందించడం పట్ల  విద్యార్థుల  తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.      

   

  • మృతుడి కుటుంబానికి పరామర్శ 

జగదేవ్ పేట గ్రామంలో కొర్రీ ప్రభుదాస్ అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల  క్రితం మృతి చెందగా  ఆయన కుటుంబాన్ని ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ చైర్మన్,  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ, మండల విద్యాధికారి బత్తుల బూమయ్య, వెల్గటూర్ వ్యవశాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్,నాయకులు కూనామల్ల లింగయ్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.