ఆయుష్మాన్ భారత్ సద్వినియోగం చేసుకోవాలి

ఆయుష్మాన్ భారత్ సద్వినియోగం చేసుకోవాలి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఆయుష్మాన్ భారత్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల పట్టణ 15వ వార్డ్ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ సూచించారు. వార్డులోని శంకులపల్లిలో చత్రపతి శివాజీ హనుమాన్ బస్తి యూత్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ ఉచిత రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డ్ ప్రజలకు ఉచిత గా ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు అరె రాజన్న, తుమ్మనపల్లి రాజేష్, లింగారెడ్డి, అంగన్వాడి టీచర్ నీరజ, ఆర్ పి లావణ్య తదితరులు పాల్గొన్నారు.