కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి- మేడిపల్లి సత్యం
![కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయండి- మేడిపల్లి సత్యం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6453a0447ee6d.jpg)
ముద్ర, మల్యాల: మండలంలోని పోతారం గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యo సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా, మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి, మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి, నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, చారీ, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.