నరేంద్ర మోడీ పాలనను ప్రజలకు వివరించాలి: నిజామాబాద్ ఎం పీ అరవింద్

నరేంద్ర మోడీ పాలనను ప్రజలకు వివరించాలి: నిజామాబాద్ ఎం పీ అరవింద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ  9 సంవత్సరాల పరిపాలన గురించి ప్రజలకు వివరించాలని నిజామాబాద్ ఎం పీ ధర్మపురి అరవింద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణంలోని వివిధ వార్డుల్లో స్ధానిక నాయకులతో కలసి పలువురు ప్రముఖులను కలసి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  9 సంవత్సరాల పరిపాలన గురించి రూపొందించిన కరపత్రాలను బుక్ లెట్స్ ను వారికి అందించారు.ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ  9 సంవత్సరాల పరిపాలనలో ప్రజాకర్షిత, ప్రజా సంక్షేమ పథకాలు, ఆర్థికాభివృద్ధి, దేశవిదేశాల్లో భారత దేశ ఆర్తిక వ్యవస్థ బలోపెతం కోసం చేసిన కృషి, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు తదితర అభివృద్ధి అంశాలతో కూడిన కరపత్రాలను పట్టణంలోని పలువురు వ్యక్తులను కలిసి అందజేసి వివరించడం జరిగిందన్నారు.

మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రం లో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా అధ్యక్షుడు మొరపల్లి సత్యనారయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణీ, నియోజక వర్గ నాయకులు డా. శైలేందర్ రెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.