కలిసికట్టుగా పనిచేసి పార్టీ అబివృద్దికి కృషి చేయాలి: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

కలిసికట్టుగా పనిచేసి పార్టీ అబివృద్దికి కృషి చేయాలి: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
Dr. Jagityala MLA. Sanjay Kumar

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కార్యకర్తలు, నాయకుల మధ్య  ఎలాంటి మనస్పర్థలు ఉన్నా చర్చించుకొని కలిసికట్టుగా పనిచేసి బిఆర్ ఎస్ పార్టీ అబివృద్దికి కృషి చేయాలని అప్పుడే అందరికి అవకాశాలు వస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ ఎస్ వీ ఎల్ ఆర్  గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ 1,2,14,15,16,17 వార్డుల ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమనికి పాల్గొన్న ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ తో కలిసి పార్టీ జెండా అవిష్కరిచారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలు  ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అన్నారు. జగిత్యాల పట్టణంలో 15 కోట్ల  బి టి రోడ్లు పూర్తి చేసుకున్నామని పట్టణంలో ప్రార్థన మందిరాలకు నిదులు కేటాయించమన్నారు.

పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట పత్రాలు  ఇచ్చి రెండు నెలల గడువు ఇచ్చి ప్రజలకు అన్యాయం  చేశారని, త్వరలోనే నిజమైన లబ్ధిదారులకు 4500 ఇండ్ల డబల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేస్తామని అన్నారు. పట్టణానికి ప్రతి ఏటా 45 కోట్లు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్ర శేకర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, కౌన్సిలర్ లు కుసారి అనిల్, బద్దం లత జగన్, కూతురు పద్మ, తోట మల్లికార్జున్, కూతురు రాజేష్, సిరికొండ పద్మ సింగ రావు, నాయకులు బండారి నరేందర్, సమిండ్ల శ్రీనివాస్, మొగిలి, మహిళ విభాగం అధ్యక్షురాలు కచ్చు లత, యూత్ అధ్యక్షుడు గిరి, దుమల రాజ్ కుమార్, ఎల్ల గాంగరాజం, అలిశెట్టి వేణు, సుధాకర్ రావు ,కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.