ప్రభుత్వ ఉపాధ్యాయుడు  సస్పెండ్.... కలెక్టర్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో...

ప్రభుత్వ ఉపాధ్యాయుడు  సస్పెండ్.... కలెక్టర్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ డిఈవో జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ ఎం. క్రిష్ణo రాజు ఈనెల 14న ఇబ్రహీం పట్నం బస్టాండ్ లో మద్యం మత్తులో తాగి పడిపోయిన ఫటన పై జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష సీరియస్ అయ్యారు.
ఈ ఘటన కలెక్టర్ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డిని  ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపగ వాస్తవమని తేలింది. ఈనెల 14న సదరు ఉపాధ్యాయుడు పాఠశాల విధులకు గైర్హాజరు అయినట్లు గుర్తించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి డాక్టర్ బి జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం ఎం. క్రిష్ణo రాజు ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.