గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ....

గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ....

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 15 వార్డులో  భీరయ్య గుడి వద్ద  అంగన్వాడి సెంటర్ లో గురువారం స్థానిక వార్డు కౌన్సిలర్ తోట మల్లికార్జున్ చేతుల మీదుగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించడంతో పాటు పౌష్టికాహారం తీసుకొని వారికి జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం చిన్నారులు, మహిళలకు చేతులు శుభ్రపరచుకునే విధానం గురించి వివరించడంతో పాటు సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మాధవి, ఆర్పి లావణ్య, అంగన్వాడి ఆయా మాలతి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు