వర్టికల్ పనితీరులో మెరిసిన మెదక్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు సొంతం

వర్టికల్ పనితీరులో మెరిసిన మెదక్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు సొంతం

ముద్ర ప్రతినిధి, మెదక్:ఉత్తమ పనితీరు కనబరిచిన రిసెప్షన్ ఆఫీసర్‌లలో మెదక్ జిల్లా నుండి ముగ్గురు రిసిప్షన్ మహిళా కానిస్టేబుల్ ఆఫీసర్ లు ఎంపికయ్యారు. 2022 సంవత్సరానికిగాను రాష్ట్ర వ్యాప్తంగా  మెరిటోరియస్, ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసుల రిసెప్షన్ ఆఫీసర్‌లను సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ, రాణి రుద్రమ దేవి ఆడిటోరియంలో  సన్మానించారు. హెచ్డిఎఫ్సి  బ్యాంక్ ఆధ్వర్యంలో  సామర్థ్యాలు, ప్రవర్తన అంశాలు, కీర్తి సమగ్రత ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా (75) మందిని సత్కరించడం జరిగింది.  మెదక్ జిల్లా నుండి ఎంపికై సన్మానం పొందిన వారిలో సింగారం రేణుక (మెదక్ రూరల్ పిఎస్),
దల్చుకూరి యశోద (రేగోడ్ పిఎస్), పల్లపు కవిత (నర్సాపూర్ పిఎస్) ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి  అంజనీ కుమార్‌, సీనియర్ ఐపీఎస్ అధికారులు  మహేష్ భగవత్,  అభిలాష బిష్త్, సందీప్ శాండిల్య సన్మానించారు. వీరిని జిల్లా ఎస్.పి. పి.రోహిణి ప్రియదర్శిని అభినందించారు.