ఇంజనీరింగ్ విద్యార్థి భరత్ రెడ్డి ఆత్మహత్య
- పేరూరులో విషాదం
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ మండలం పేరూరులో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన ర్యావ దుర్గారెడ్డి రెండవ కుమారుడు భరత్ సింహారెడ్డి హైదరాబాద్ శివారులోని ఓ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
10న బర్త్డే...
ఈనెల 10వ తేదీన భరత్ సింహారెడ్డి బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా బట్టలు కూడా కొనుకున్నాడు. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న భరత్ మిత్రులందరికీ వివిధ కాలేజీలకు వెళ్ళిపోగానే గదికి గడియవేసి ఆత్మ చేసుకున్నాడు. సాయంత్రం తోటి మిత్రులు వచ్చి పిలవగా గడియ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. స్వగ్రామం పేరూరులో విషాదం కలుముకుంది. భరత్ మృత దేహం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.