రామాయంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మ ప్రచారం

రామాయంపేట మండలంలో ఎమ్మెల్యే పద్మ ప్రచారం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్  పార్టీ  అభ్యర్థి  యం. పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట మండలంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. మండలంలోని లక్ష్మాపూర్,  బాపనయ్య తండా, కాట్రియల్, కాట్రియల్ తండా, పర్వతాపూర్, లఖ్య తండా, కిషన్ తండా, జమ్లా, బిల్యా తండా, దంతేపల్లి, జాన్సీ లింగాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునేందుకు వస్తారన్నారు. అలోచించి ఓటు వేయాలని పద్మ దేవేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊరూర బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు.