వనదుర్గా సన్నిధిలో జన సందడి

వనదుర్గా సన్నిధిలో జన సందడి

ముద్ర ప్రతినిధి, మెదక్: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సుదూర ప్రాంతాల నుండి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదీ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకుని తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం,  కుంకుమార్చనలు, బోనాలు, తలనీలాలు, సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏడుపాయల చైర్మన్ సాతెల్లి బాలా గౌడ్, ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది మధుసూదన్ రెడ్డి సూర్య శ్రీనివాస్, రవి, వీర్ కుమార్, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్ పర్యవేక్షించారు. వేద పండితులు శంకర శర్మ, పార్థివ శర్మ, మురళీధర్  ప్రత్యేక పూజలు నిర్వహించగా పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారు.