కర్ణాటక ఐటీ దాడిలో లభించిన కాంగ్రెస్ నోట్ల కట్టలు

కర్ణాటక ఐటీ దాడిలో లభించిన కాంగ్రెస్ నోట్ల కట్టలు
  • తెలంగాణకు డబ్బులు తరలించి గెలవాలని కుట్ర
  • మెదక్ లో మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి...తెలంగాణకు 1500 కోట్లు తరలించి, డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివే అన్నారు. శుక్రవారం మెదక్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. గతంలో కర్ణాటక లో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు 50 శాతం కమిషన్ నడుస్తుందని తెలిపారు. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసి తెలంగాణకి డబ్బులు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. 

1500 కోట్లతో తెలంగాణలో గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం స్థానాల్లో అభ్యర్థులు లేరన్నారు. పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదన్నారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టికి 75 రూపాయల డబ్బులు కట్టాలన్నారు. 
కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. 

బెంగళూరు వయా చెన్నై కొంత హైదరాబాద్ కి కూడా డబ్బులు చేరాయని సమాచారం ఉందన్నారు. కొంత మంది బిల్డర్లకు డబ్బులు వచ్చాయని తెలిసింది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తానని అనుకోవడం ఓ పగటి కల అన్నారు. కాంగ్రెస్ లో డబ్బుల్లోనోళ్ళకే టికెట్ ఇస్తారాని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, చంద్రపాల్, జగపతి, మల్లికార్జున్ గౌడ్, మామిళ్ళ ఆంజనేయులు ఉన్నారు.