కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ లు

కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ లు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్, హవెలి ఘనపూర్ మండలాలకు చెందిన పలువురు సర్పంచ్ లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సమక్షంలో బుధవారం చేరారు. రామాయంపేట సమీపంలో ఘణపురం మండల కేంద్రం సర్పంచ్ నోముల సబిత భర్త, మాజీ ఎంపీటీసి నోముల శ్రీకాంత్, నాగపూర్ సర్పంచ్ రాజేందర్ రెడ్డి, మెదక్ మండలంల పేరూర్ సర్పంచ్ జానకీరాంరెడ్డి, జక్కన్నపేటku చెందిన నాయకులు మామిండ్ల సాయిలుతో పాటు దాదాపు మూడు వందల మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.  అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని, మీ కుటుంబ సభ్యుడు రోహిత్ ను అత్యధిక మేజార్టీతో గెలిపించుకోవాలని హన్మంత్ రావు విజ్ఞప్తి చేశారు.  నాతో పాటు నడిచిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జీవన్ రావు, ఘణపురం మండల అధ్యక్షులు లక్కర్సు శ్రీనివాస్, సిరిమల్లె శ్రీనివాస్, శేరి మహేందర్ రెడ్డి, ఘణపురం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, నాగాపురం సర్పంచ్ ఒంటరి రాజేందర్ రెడ్డి, మంజుల సిద్ధగిరిగౌడ్, అక్బర్, బొజ్జ పవన్, పరుశురాం గౌడ్, ఉప్పల రాజేష్, ఆదిల్, అజ్మీర స్వామి నాయక్, అక్బర్, మెదక్, ఘణపురం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.