మెదక్ లో ప్రజావాణి తిరిగి ప్రారంభం

మెదక్ లో ప్రజావాణి తిరిగి ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత రెండు నెలలుగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియడంతో సోమవారం ప్రజావాణి తిరిగి ప్రారంభించారు. కలెక్టర్ రాజర్షి షాకు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ విజ్ఞప్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిష్కారించే సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశాంచారు.