నమ్మిన వారినే ముంచే వ్యక్తి కెసిఆర్

నమ్మిన వారినే ముంచే వ్యక్తి కెసిఆర్
  • కేసిఆర్ పై ఈటెల ఘాటు విమర్శ

ముద్ర, తూప్రాన్:నమ్మిన వారిని ముంచే వ్యక్తి కెసిఆర్... అభివృధి చేస్తాడని నమ్మి ఓటేస్తే  పేదల వేల ఎకరాల భూమిని లాక్కుని ప్రజలను రోడ్డుపాలు చేసిన ఘనత  కేసిఆర్ దే అని గజ్వెల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ ద్వాజమెత్తారు. మరోసారి ఓటేసి మోసపోవద్దని, బీఅర్ఏస్ నాయకులను గ్రామాల్లో తిరగనియొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం తూప్రాన్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఇమాంపుర్ గ్రామంలో రోడ్ షోకి బారీ ఎత్తున ప్రజలు, నాయకులు హాజరయ్యారు స్థానిక నాయకులు ఈటెలకు గజమాలతో స్వాగతం పలికారు. అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షోలో పాల్గొన్నారు. మంచి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ రాజులా బ్రతుకుతున్న రైతుల భూములను తక్కువ ధరకు లాక్కుని వేల కోట్ల కమిషన్ లు పొందిన మూర్కవు ప్రభుత్వం బీఅర్ఎస్ అని మండిపడ్డారు. వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించి కష్టం నమ్ముకున్న వాళ్ళని రోడ్డుపై మొక్కజొన్న కంకులు పండ్లు అమ్ముకునే దీనస్థితికి కారణం కేసిఆర్ కాదా అని ప్రశ్నించారు.

ఎన్నడూ లేని బీఅర్ఎస్ బ్రోకర్ లు, నాయకులు ఇప్పుడు వస్తున్నారు. కుల సంఘాలతో మీటింగ్ లు పెడుతున్నారు. దావతులు ఇస్తున్నారు. కాయకష్టం చేసి పిల్లలను చదివిస్తే వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్ లు వేస్తూ, పేపర్ లికులు చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు మోసపోయింది చాలు ఒక్కసారి మీ ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి అందిస్తే  మీ కష్ట సుఖాల్లో ఉంటానని,  నోటీసులు ఇచ్చిన భూములు తిరిగి వారికే ఇప్పిస్తామని హమినిస్తున్నమని ఈటెల రాజేందర్ అన్నారు. బీసీ వర్గాలకు కేసిఆర్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని, దొరల పాలన నుండి మనకు విముక్తి సమయం దగ్గరలోనే ఉందన్నారు. వారితో బీజేపీ నాయకులు రామ్మోహన్ గౌడ్, సాయిబాబా, మహేష్ గౌడ్, సర్పంచ్ లు మల్లేష్, పోచయ్య భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలి వచ్చారు.