ప్రాణం ఉన్నత వరకు మీ బిడ్డగా సేవ చేస్తా

ప్రాణం ఉన్నత వరకు మీ బిడ్డగా సేవ చేస్తా
  • శాస్త్రోక్తంగా ఎమ్మెల్యే రోహిత్ క్యాంపు కార్యాలయ ప్రవేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రాణం ఉన్నత వరకు మీ బిడ్డగా సేవ చేస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ శివాని దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, శివాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన,  హోమం నిర్వహించి ప్రవేశించారు. అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు వైద్య రాజు పంతులు, శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు శ్రీభాష్యం మధుసూదనచారి, వైద్య శ్రీనివాస్, ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రోహిత్ ను ఆశీర్వదించారు. ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు ఆశీర్వదించారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు వాణి దంపతులు, కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా రోహిత్ మాట్లాడుతూ...

ఆశీర్వాదం కోసం వచ్చిన తనను ప్రజలు సొంత బిడ్డగా ఆదరించారు.  ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల రుణం తీర్చుకోలేనిదని, ఆదరించిన ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ప్రత్యర్థులు పిల్లాడికి ఏమీ తెలుసని ప్రశ్నించినా అదేమీ లెక్క చేయని ప్రజలు రోహిత్ గెలుపు కోసం చేసిన కృషిని మరచిపోనన్నారు. కాంగ్రెస్ చెప్పిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామని చెప్పారు. మెదక్ ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పదేళ్ల కాలంలో మెదక్ పూర్తిగా వెనకబాటుకు గురైందని, ఈ సారి అన్ని రంగాల్లో మెదక్ ముందు ఉండే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ రెడ్డీ, జీవన్ రావు, సురేందర్ గౌడ్, బొజ్జ పవన్, ప్రభాకర్ రెడ్డి, హఫీజ్, శంకర్, రాజేష్, శేఖర్, రాజలింగం, మంగ మోహన్ గౌడ్, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, మహేష్ గౌడ్, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.