కెసిఆర్ ను దింపే వరకు నిద్ర పోం

కెసిఆర్ ను దింపే వరకు నిద్ర పోం

బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే
కవిత అరెస్టు కాదు
మెదక్ రోడ్ షోలో విజయశాంతి ఫైర్

ముద్ర ప్రతినిధి, మెదక్: యుద్ధం మొదలైంది... 420 కెసిఆర్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది... అప్పటి వరకు నిద్ర పోమని కాంగ్రెస్ పార్టీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్ కో- ఆర్డినేటర్, సినీ తార, మెదక్ మాజీ ఎంపి ఎం. విజయశాంతి అన్నారు. మంగళవారం రాత్రి మెదక్ లో రోడ్  షో నిర్వహించారు. ఈ సందర్బంగా విజయశాంతి మాట్లాడుతూ... రెండు సార్లు ఓట్లేసిన పాపానికి తెలంగాణ దీవాళ తీసింది, మూడవ సారి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. పదేళ్లలో ఏం చేశారని, ఎస్సి, ఎస్టీ భూములు లాకున్నారు, ఫీజు రియంబట్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, రైతు ఆత్మహత్యలు, ఆసరా పింఛన్లు లేవు, బెల్టు షాపులు తెరిచి మహిళల పుస్తెలు టెంపారు, డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి చాక్లేట్లు, చెరువులు కబ్జా చేసినందుకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి పాపానికి మేడిగడ్డ పిల్లర్లు కృంగాయన్నారు. ఓటేసి అధికారమిచ్చిన ప్రజలు సిగ్గు పడుతున్నారన్నారు. బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే అన్నారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితను అరెస్టు చేయరన్నారు. రాములమ్మను తొక్కడానికి రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు. దేవుడు సృష్టించాడు, ప్రజల ప్రేమ అభిమానం ఉన్నంతసేపు నన్నెవరు తొక్కలేరన్నారు. కెసిఆర్ ను ప్రతిదించే వరకు నిద్రపోండి శపధం చేశారు ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సేవా భావంతో మెదక్ లో పోటీ చేస్తున్న మైనంపల్లి రోహిత్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్, నాయకులు జీవన్ రావు, సురేందర్ గౌడ్, సుప్రభాతరావు, రామచందర్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.