ముస్లాపూర్ పాఠశాలలో పాము పిల్లల కలకలం

ముస్లాపూర్ పాఠశాలలో పాము పిల్లల కలకలం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా అల్లాదుర్గం  మండలం ముస్లాపూర్  గ్రామంలో గల మండల ప్రజా పరిషత్ పాఠశాలలో పాము పిల్లల కలకలం రేపింది. పాఠశాలలో 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేస్తుండగా ఆకస్మాత్తుగా ఒక పాము పిల్ల పాఠశాల ఆవరణలో కనిపించగా దానిని విద్యార్థులు గమనించి ఉపాధ్యాయురాలికి తెలియజేశారు.  అక్షయ పాత్ర సిబ్బంది కర్ర సహాయంతో చంపగా, మరో పక్క నుండి ఒకటి తరువాత ఒకటి వరుసగా ఏడు పాములను చంపడంతో విద్యార్థులు, ఉపాద్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.