పేదలకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం....

పేదలకు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం....
  •  ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి... అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమని ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు మంగళవారం గొల్లపల్లి మండలంలోని ఆత్మకూర్ దమ్మన్నపేట లక్ష్మీపూర్ భీమరాజు పల్లి స్థానిక మండల కేంద్రంలో గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు .అనంతరం ఆయన మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను  ప్రజలకు వివరించారు. మహిళల కోసంమహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం సౌకర్యలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయడం జరుగుతుందన్నారు.

 రాష్ట్రంలో ప్రజలను  బీఆర్ఎస్ పార్టీ  అన్ని విధాలుగా మోసం చేసిందని, దోపిడీ చేసిందని ఆరోపించారు. అలాగే ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రంథాల చైర్మన్ కటారి చంద్రశేఖర రావు మండల అధ్యక్షులు గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి. ఇస్రాజ్ పల్లి సర్పంచ్ చిర్ర గంగాధర్ అబ్బ పూర్ సర్పంచ్ వెంకటేష్  గురజాల బుచ్చిరెడ్డి నేరెళ్ల మహేష్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళాలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.