మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం

మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం
  • ఎమ్మెల్యే రోహిత్ గెలుపుకు కృషి చేసిన వారికి థాంక్స్ 
  • మెదక్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి
  • మైనంపల్లి హన్మంత్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.శుక్రవారం మెదక్ ఎమ్మెల్యేగా గెలపొందిన  మైనంపల్లి రోహిత్ మొదటి సారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ... మెడక్ ఎమ్మెల్యేగా డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను గెలిపించిన నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్ధులమై అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఆగస్టులో తిరుమల తిరుపతి దేవస్థానంలో తన కొదుకు మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తానని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో  మాట్లాడారు. ఎంఎస్ఎస్ఓ చైర్మన్ గా మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని, అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. మెదక్కు రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తామని, ఏడుపాయల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నారు. ఏడుపాయల నుంచే మా ప్రచారం ప్రారంభమైందని, అమ్మవారి అనుగ్రహంతోనే మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలుపొందారని పేర్కొన్నారు. యాదాద్రితో పోటీ పడుతూ ఏడుపాయలను అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రావు, ప్రశాంత్రెడ్డి, బొజ్జ పవన్, ముత్యంరెడ్డి, మహేందర్రెడ్డిలతోపాటు తదితరులు పాల్గొన్నారు.