మాధవనంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి ఆలయ పున:ప్రతిష్ఠ

మాధవనంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి ఆలయ పున:ప్రతిష్ఠ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలోని హనుమంతరావు కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయ పున:ప్రతిష్ఠ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ మాధవనంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆదివారం ముగిసింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఆశీస్సులు పొందారు. మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, కాలనీ వాసులు, వేద బ్రాహ్మణులు పాల్గొన్నారు.

అంతకుముందు కట్టకింద హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రామయంపేట్ మండలం తొనిగండ్ల గ్రామంలో ఆంజనేయ స్వామి అభిషేక, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు,  ఆలయ అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు ప్రకటించారు.